శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 1,500 మందితో జనసేన బూత్ కమీటీ సభ్యులు సిద్దం

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ, బూత్ కమిటీ సభ్యులు 1,500 మందితో రోటరీ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 50 ఓట్ల కి ఒక జనసేన వాలంటీర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పంచాయతీ స్థాయిలో 10 మంది తో కూడిన పంచాయతీ కోఆర్డినేటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న 2 నెలలు ప్రతి జనసైనికుడు అహర్నిశలు కష్టపడాలని, చివరి ఓటర్ కూడా మిస్ అవ్వకుండా బూత్ లో ఓటు వేసే విధంగా ఒక టీం స్పిరిట్ తో సమన్వయంతో పని చెయ్యాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అందించే దిశగా జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి దగ్గర అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలవాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way