24వ డివిజన్లో దిగ్విజయంగా కొనసాగిన జనచైతన్య యాత్ర

   ఒంగోలు ( జనస్వరం ) : నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 68వ రోజు ఒంగోలులోని 24వ డివిజన్ లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ 24వ డివిజన్ లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి పలు సమస్యలను గుర్తించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేవకపోవడం, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, అకారణంగా పెన్షన్లు తొలగించడం వంటివి, ఉపాధి దొరకటం లేదని మా దృష్టికి వచ్చాయని తెలిపారు. వీటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకుని పోయి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని జనసేన నాయకులు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి నవీన్ పవర్, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష,పోకల హనుమంతురావు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, వీర మహిళ మాదాసు సాయి నాయడు మరియు జనసేన నాయకులు గలగల పవన్, రాఘవ చంగళశెట్టి, ఉంగరాల వాసు,సాయి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way