చంద్రగిరి నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జల్లికట్టు సంబరాలు

చంద్రగిరి

      చంద్రగిరి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని, రంగంపేటలో కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం జల్లికట్టు జరుగుతుంది. ఈ సంవత్సరం వేలాదిమంది వీక్షించడానికి విచ్చేసారు. జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనల మేరకు చంద్రగిరి మండల అధ్యక్షులు రావి కిషోర్ మరియు రంగంపేట నాయకుల నేతృత్వంలో, చిత్తూరు జిల్లా కార్యదర్శి దేవర మనోహర గారి చేతులు మీదుగా 1200 మందికి భోజనము పాకెట్లు మరియు మజ్జిక, నీళ్ళ పాకెట్లు అందచేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఎంతో అందంగా తీర్చి దిద్దిన ముగ్గులు వలే ఈ సంవత్సరం మనందరి జీవితాలలో హరివిల్లులాగా అందంగా ఉండాలని, అలాగే కరోనా ఒమిక్రాన్ వైరస్ సోకకుండా మాస్కులు, శానిటైజర్లు వాడాలని దూరం పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు, లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల, అజయ్ ప్రసన్న, వేణు, కరుణాకర్, నాగార్జున, అమర్, బాల మురళి, ధరణి, కిరణ్, గజేంద్ర, రాకేష్, సాయిరాం లక్ష్మన్, ఢిల్లీ, దిలీప్ రాయల్, రాంబాబు, జాని పాల్గొని జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way