Search
Close this search box.
Search
Close this search box.

జై భీమ్ యువజన నాయకులు జనసేన పార్టీలోకి చేరిక

    వీరఘట్టం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నడిమికెళ్ల గ్రామానికి చెందిన జైభీమ్ యువజన నాయకుడు పాలక వినోద్ ని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం, జనసేన జాని లు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాలక వినోద్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. నా మనసు అంత మా గ్రామంలో జనసేన పార్టీకి అండగా ఉండాలని, మా గ్రామంలో ఇంతవరకు ఎవరు జనసేన పార్టీ తరుపున ఒక్కరు వుండకపోవడం చూసాను. ఇకనుండి మా గ్రామానికి సేవ చేయాలి, ప్రజలకు అండగా ఉండాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అండగా నిలిచి అడ్డుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని దృఢ నిచ్చయంతో వున్నాను. వీరఘట్టం మండలం జనసైనికులతో కలిసి పనిచేస్తానని, మా గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి నావంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అనంతరం మత్స పుండరీకం, జనసేన జాని మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రతి గ్రామంలో ఒక్కడితో మొదలై జనప్రభంజనంగా మారుతుదని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి ప్రజా ప్రభుత్వం స్థాపిస్తుందని అన్నారు. దత్తి గోపాల కృష్ణ, వావిలపల్లి నాగభూషన్ లు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేనపార్టీ అభివృద్ధికి యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘుమండల గణేష్, గోలి అనిల్, దూసి సందీప్, రౌతు గోవింద, కర్ణేన సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way