మానవతా హృదయంతో అధికారులకు కోవిడ్ కిట్లను అందజేసిన జగ్గయ్యపేట జనసైనికులు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారి సూచనలు మేరకు నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నామన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండల తహశీల్దార్ మరియు తదితర అధికారులకి కోవిడ్ 19 నుంచి రక్షణ కొరకు జనసేన పార్టీ బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కోవిడ్ కిట్ ని అందజేయడం జరిగింది. ఈ కిట్ లో ఫేస్ షీల్డ్, శానిటైజెర్, హ్యాండ్ గ్లౌజ్, N95 మాస్కులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ కరోనా కాలంలో ముందుండి నిరంతరం ప్రజలతో వారి సమస్యల పరిష్కారాలతో కోవిడ్ పేషెంట్ లతో రద్దీగా ఉంటూ అందరకి జవాబుదారీతనం గా ఉంటున్న మండల తహశీల్దార్ లు రాష్ట్రం లో అనేక చోట్ల కోవిడ్ బారిన పడుతున్నారని కాబట్టి నియోజకవర్గం లో ఉన్న మూడు మండలాల తహశీల్దార్ లకి కోవిడ్ నుండి రక్షణ కొరకు వారికీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ కిట్ లని అందజేస్తామని బాడిశ మురళీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పసుపులేటి గోపి, నరేష్, కార్తీక్, అజయ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.