Search
Close this search box.
Search
Close this search box.

అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్న జగన్ రెడ్డి

అంబేద్కర్

     అనంతపురం ( జనస్వరం ) : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని స్థానిక జిల్లాపరిషత్ దగ్గరగల రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ నిర్మాణానికి ఆయన చేసిన సేవలను జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత స్మరించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం మన రాష్ర్టంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తు ప్రజల, ప్రతిపక్ష పార్టీల స్వేచ్చా, స్వాతంత్రాలకు భంగం కలిగిస్తుందని రాబోయే కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way