లక్షమందికి పైగా అమ్మ ఒడి లబ్ధిదారులను అనర్హులుగా తేల్చిన జగన్ రెడ్డి : యం.ధనుంజయ

అమ్మ ఒడి

          పామిడి ( జనస్వరం ) : అమ్మ ఒడి పథకాన్ని కొనసాగించడం చేతకాక, నిధులు లేక అప్పులు దొరకక అమ్మఒడి పథకానికి మంగళం పాడేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనల పేరుతో అర్హులైన వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారని పామిడి మండల అధ్యక్షుడు యం.ధనుంజయ పత్రికాముఖంగా ఆరోపించారు. విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదని అన్నారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి అంటూ తల్లిడదండ్రులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిందని ఈ నిబంధనల ప్రకారం ఏపీ వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారని అన్నారు. జగన్ రెడ్డి గారి చేతగాని పరిపాలన వల్ల ప్రజలు వంచనకు గురవుతున్నారని ఇలాంటి చెత్త పరిపాలనకు ప్రజలు కూడా మంగళం పాడే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way