Search
Close this search box.
Search
Close this search box.

జగన్… దిగుజారుడు రాజకీయాలు ఆపాలి : బొబ్బేపల్లి సురేష్ నాయుడు

జగన్

     సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రెండవ విడత వారాహి విజయ యాత్రలో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి, సిబీఐ దత్తపుత్రుడు ఒక్క పెళ్లి చేసుకున్న ఎక్కడా కూడా శంకుస్థాపనలకు గాని, స్వామి వార్ల కళ్యాణాలకు గాని దంపతులుగా పోలేని స్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న ఏదైతే వెంకటగిరిలోని నేతన్న హస్తం బటన్ నొక్కానాటికి వచ్చి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు దీటుగా సమాధానం చెప్పనాటికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అక్కడ మా అధినేత పెళ్లిళ్ల గురించి మాట్లాడినటువంటి దిగజారుడు రాజకీయాన్ని చేస్తున్నటువంటి అవినీతి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలని, 22 మంది ఎంపీలను ఇచ్చి ఆయనకి అధికారాన్ని గట్టపెడితే రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేస్తున్నారో వాటిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగింది వాలంటీర్ వ్యవస్థని తీసుకువచ్చారు. మంచిదే అయితే వీళ్ళకి పై అధికారి ఎవరు? అదే విధంగా వీళ్లల్లో కొంతమంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెన్షన్ల కి ఇచ్చినటువంటి నిధులని అపహరించడం. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని వికృత చేస్తాలకి సంబంధించి వీళ్ళకి పై అధికారికి తెలియజేయాలంటే ఎవరికీ తెలియజేయాలి. అదేవిధంగా ఒక కుటుంబ సభ్యుడి యొక్క ఆధార్ కార్డుగా వచ్చు, అతను పర్సనల్ డేటా కావచ్చు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు అనేక విషయాలని డేటా తీసుకుంటున్నారు. అది తీసుకున్న డేటా తెలంగాణలోని హైదరాబాదులో ఎఫ్ఓఏ ప్రవేటు ఏజెన్సీకి వెళుతుంది. ఆ ఏజెన్సీ ఎవరిది? ఆ ఏజెన్సీ అన్నకు ఉన్నది ఎవరు? అదేవిధంగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి డేటా వాలంటీర్లకి ఎందుకు ఇవ్వాలి రేపు పొద్దున సైబర్ నేరగాల చేతులకు వెళితే ఒంటరి మహిళల పరిస్థితి ఏంది? ఆడబిడ్డలు పరిస్థితి ఏంది అనేటువంటి అనేక విషయాలు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తే దానికి సమాధానం చెప్పలేక తత్తర బిత్తర పోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినదానికి సమాధానం చెప్పలేక మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిల్లలు గురించి మాట్లాడుతున్నారంటే మరి ఇంతకంటే దరిద్రం ఇంకేముంది. ఇకనైనా ప్రజలు కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అన్నారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండలధ్యక్షులు ప్రసాద్, మండల నాయకులు జాకీర్, సందీప్, సుధాకర్, ఖాజా, శ్రీహరి, వంశీ, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way