Logo
Date of Publish : 27 June 2022, 3:05 pm
Editor : Sake Naresh

మైనార్టీ ముస్లింలను మోసం చేసిన జగన్ ప్రభుత్వం : జనసేన నాయకులు షేక్ మహబూబ్ మస్తాన్

    ఆత్మకూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైనార్టీ ముస్లింలకు మోసం చేసిందని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్  పత్రిక విలేకరులతో మాట్లాడుతూ దులహన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు చెప్పడం జరిగింది. జగన్ రెడ్డి చేతకానీ పరిపాలనకు నిదర్శనమని మస్తాన్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న టిడిపి ప్రభుత్వం ముస్లింలకు దులహన్ పథకం కింద 50 వేలు ఇస్తే 2019లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలు దులహన్ పథకం కింద ముస్లిం మైనార్టీలకు ఇస్తాను అని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా దగ్గర దుల్హన్ డబ్బులు ఇవ్వలేను అని చెప్పడం సరికాదని 90 శాతం ముస్లిం ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పడం మడమ తిప్పడం అనడానికి నిదర్శనం. మూడు సంవత్సరాలు పూర్తయి పథకం తీసేయడం ముస్లింలకు అవమానించడం అని తెలియజేశారు. అదేవిధంగా యువత ఉపాధి స్థిరపడేందుకు స్వయం ఉపాధి కింద ఐదు లక్షలు ఇస్తాను అన్నారు. ఇంకా ముస్లిం మసీద్ మౌసన్లకు ఇమామ్లకు గౌరవ వేతనం కింద పదిహేను వేలు ఇస్తాను అన్నారు. ముస్లింస్ మైనార్టీలో ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. హజ్ యాత్రకు యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చి ఏది కూడా ముస్లిం మైనార్టీలకు ఇవ్వకపోవడం వైసీపీ ప్రభుత్వం చేతకాని అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com