ప్రజలను, రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

– ఇది ప్రకృతి వైపరీత్యం అనడం కన్నా ప్రభుత్వ వైఫల్యం అనవచ్చు.
– వివాహానికి వెళ్ళే సమయం తీరిక ఉన్న వరదల్లో మునిగిపోయిన ప్రజలకు సహాయం అందించడంపై మాత్రం లేదు.
– సొంత జిల్లా కడప లో కాలు పెట్టని సీఎం జగన్
– నోటి దగ్గరకు వచ్చిన పంట వరదలో కొట్టుకు పోయింది
– జగన్ గారి పాలనలో మూడేళ్ల నుంచి రైతుల కష్టాలు వర్ణనాతీతం
– ప్రజలకు సేవ చేయడంలో వార్డు వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది
– జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
        విజయవాడ, (జనస్వరం) : ప్రజలను రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైయిందని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన ప్రజలను రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఇది ప్రకృతి వైపరీత్యం అనడం కన్నా ప్రభుత్వ వైఫల్యం అనవచ్చు అని, వివాహానికి వెళ్ళే సమయం తీరిక ఉన్న సీఎం వరదల్లో మునిగిపోయిన ప్రజలకు సహాయం అందించడం పై మాత్రం లేదా అని? ఒక్క పిడుగు పడితే 40 నిమిషాల ముందు మన సెల్ ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అలాంటిది భారీ వర్షాలు, తుఫాను ఉన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగైదు రోజులు ముందుగానే తెలుసు కదా అయినా ఎందుకు కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. నిరంతరం రివ్యూలు ఎందుకు చేయలేదని, బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ముందస్తు సమాచారం ఉన్న ప్రభుత్వ అలసత్వాన్ని గల కారణం ఏంటి అని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రతి 50 మందికి ఒక వార్డు వాలంటీర్లు పెట్టిన ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడంలో వార్డు వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ నాలుగు జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాల పంట నష్టపోయిందని, అంటే ఈ నష్ట తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని, వేల కొద్ది గ్రామాలు వేలల్లో పశు సంపద, మూగజీవాలు మరణించాయని అయినా ఈ ప్రభుత్వానికి కనికరం లేదని కనీసం స్పందించడం లేదన్నారు. మూడు సంవత్సరాల నుంచి అకాల వర్షాలకు, తుఫాన్లకు చేతి వరకు వచ్చిన పంట నోటి వరకు వెళ్లడం లేదని, సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు శాపంగా మారిందని, అందుకే పంట పండించిన తుఫాను రూపంలో అకాల వర్షాల రూపంలో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఉన్నారా లేరా? ఉంటే ఏం చేస్తున్నారని, రాష్ట్రం ఎంత తల్లడిల్లిపోతుంటే బాధ్యత కలిగిన మంత్రి ఏం చేస్తున్నారని, ఈ విపత్తు సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోయారని, సకల శాఖ మంత్రి సజ్జల నాలుగు రోజులుగా ఎందుకు మీడియాకి ముఖం చూపించడం లేదని, కడపలో అధికార యంత్రాంగం ఎందుకు చేతులెత్తేసిందని, బాధితులకు కనీసం అన్నం పెట్టకుండా గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ తో సరిపెడుతున్నారని తెలిపారు. ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వ అలసత్వాన్ని గల కారణం ఇసుక అక్రమ రవాణా కోసం లక్షల మంది ప్రజల్ని, లక్షల ఎకరాల్లో పంటలను ముంచేసారని, అన్నమయ్య డ్యాంలో నీటిని క్రమపద్ధతిలో ఎందుకు విడుదల చేయలేదని, కట్టలు కొట్టుకుపోయే వరకు నీటిని ఎందుకు నిల్వ చేశారని. దిగువ ప్రాంతాల్లో అక్రమ ఇసుక తరలింపు అయ్యే వరకూ నీటిని విడుదల చేయకపోవడమే కారణంగా కనిపిస్తోందని అన్నారు. కడప రాజంపేట రైల్వే కోడూరు లో పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. చనిపోయిన పశువులను ఇంకా తీయలేదని డీకంపోజర్ చేయమని ప్రజలు ప్రాధేయ పడుతున్నారని, అన్నం వద్దు చనిపోయిన మూగజీవాలు తీసేయమని పదేపదేప్రాధేయ పడుతున్నారని, కానీ అధికారులు అలసత్వం అంతా ఇంతా కాదని, ఇది మా శాఖ కాదు మా శాఖ కాదని తప్పించుకుంటున్నారని, ప్రజలు గల్లంతైన వాళ్ళని వారే వెతుక్కుంటున్నారని, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ప్రభుత్వ అలసత్వoమని, 20 నిమిషాలకే రాజంపేట రైల్వే కోడూరు అల్లకల్లోలం అయిపోయిందినని, కడపలో ఒక్క పులివెందుల నియోజక వర్గంలోనే అభివృద్ధి కేంద్రీకృతమైందని మిగతా తొమ్మిది నియోజకవర్గాల అభివృద్ధి ఎందుకు పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షం కూడా లేదని 10కి 10 వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ముఖ్యమంత్రి, అక్కడే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అక్కడే ఇద్దరు వీఐపీ కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి ,అక్కడే ఇద్దరు చైర్మన్లు వున్నా సహాయ పునరావాస కేంద్రాల్లో మాత్రం సహాయం శూన్యంమని, 25 కేజీల బియ్యం, ఒక కేజీ నూనె, ఒక కేజీ కందిపప్పు ప్యాకేజీ కింద ప్రకటించారని, ఈ సరుకుల్ని కట్టుబట్టలతోవున్నవారు ఏం చేసుకోవాలని, భోజనం మంచినీరు ఏర్పాటు చేయాల్సింది పోయి, సరుకులు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు కడప అనంతపురం చిత్తూరు జిల్లాల్లో 6 లక్షల ఎకరాల్లో పంట నష్టం ఇందులో ఒక్క కడప జిల్లాలోనే మూడున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టమని, వేల సంఖ్యలో పశువులు చిన్న జీవాలు కోళ్ళు మృత్యువాత పడ్డాయని, రహదారులు రోడ్లు పూర్తిగా పాడైపోయి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. అయినా ఈ ప్రభుత్వం ప్రశాంతంగా ఏసీ గదుల్లో కూర్చుని, టీవీల్లో బూతులు తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని, ఒక్కరంటే ఒక్క అయినా సరే ఇంత వరకు ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజలకు బాధితులకు అండగా నిలబడాలేదని, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ వరదలపై ముందస్తు సమీక్ష చేసి, ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి సంభవించేది కాదు కదా అని ప్రశ్నించారు. తమ మంత్రులకు ఎమ్మెల్యేలకు బూతులు కాదు సాయం చేయాలని సీఎం ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు, వెంటనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖపట్నంలో ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ లీక్ ఉదంతంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించారో అదేవిధంగా కడపలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారందరికీ పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని కడప లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థలు స్థానిక ప్రజలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాని అధికార యంత్రాంగం, వైసీపీ నాయకులు గానీ, ఎక్కడా కనబడడం లేదని ప్రజలు ఇప్పటికైనా నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ వెంట నడవాలని, అదే విధంగా సొంత జిల్లా అయిన కడప లో సీఎం జగన్ రెడ్డి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.