మృతి చెందిన గున్నమ్మ కుటుంబానికి ఆర్థికసాయం చేసిన కందుల నాగరాజు

కందుల నాగరాజు

       విశాఖపట్నం ( జనస్వరం ) : దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డులో మృతి చెందిన గున్నమ్మ కుటుంబానికి జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అంతిమ సంస్కారం నిమిత్తమై ఆర్థిక సహాయం అందజేశారు. చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే డాక్టర్ కందుల నాగరాజు స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యతని చెప్పారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తను అందుబాటులో ఉంటానని తెలిపారు. మంచి పనులకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎటువంటి స్వలాభ పేక్ష లేకుండా సాయం చేయడం మాత్రమే తనకు తెలుసని చెప్పారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు జనసేన సీనియర్ నాయకులు రఘు, త్రినాధ్, గాజుల శ్రీను, పవన్, మంగ బద్రీనాథ్, కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way