Logo
Date of Publish : 21 September 2022, 4:33 pm
Editor : Sake Naresh

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేసి, ఆర్థిక ఇబ్బందులు లేవనడం హాస్యాస్పదం : పూల శివప్రసాద్

         పుట్టపర్తి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పును 8 లక్షల కోట్లు చేసిన మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. ఈ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వృద్ధాప్య పెన్షన్లు కూడా వారం, 10 రోజుల తర్వాతనే అందుతున్నాయి. పారిశుద్ధ కార్మికులకు నెలలకొద్దీ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు తద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్ టెండర్లకు కాంట్రాక్టర్లు ఎవరు కూడా సుముకత చూపించడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసి కనీసం వడ్డీ కట్టలేని స్థితికి తీసుకెళ్లారు. త్వరలో ఎలక్షన్లో వస్తాయని ఇప్పుడు ప్రజలను మీ మాటలతో మభ్య పెట్టడం సమంజసం కాదు. ప్రతి సామాన్యుడు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా మీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి బుద్ధి చెబుతారని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము అని తెలియపరిచారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com