నడుకూరు గ్రామంలో పార్టీ బలోపేతంకు కృషి చేయాలని జనసైనికులకు హితువు

నడుకూరు

        పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లతో  జనసేన నాయకులు మత్సపుండరీకం నరిసిపురం గ్రామ జనసైనికులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ JSP అనగా (J) జనం కోసం (S) స్థాపించిన (P) పార్టీ అని అన్నారు.  పవన్ రావాలి పాలన మారాలి నిన్నటి మాట… పవన్ వస్తాడు – పాలన మారుస్తాడు నేటి మాట అని అన్నారు. ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా మారుస్తాడు.  మన ధ్యేయం జనసేన పార్టీ విజయం – మన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ని చేయడం అని జనసైనికులకు సూచించారు. మీరు మీ మీ గ్రామంలో రైతులవద్దకు వెళ్లి ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు అందాయ లేదా? గ్రామంలోని కౌలురైతులకు అండగా ఉండాలని కోరారు. నరిసిపురం జనసైనికుడు చింత గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలను కలసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు మూడు వేల మంది కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పున ముపై కోట్ల రూపాయలు స్వచ్ఛందగా పంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సేవలను ప్రజలకు తెలిసేవిధంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.పి.నాయుడు, వాన మహేష్, వావిలిపల్లి నాగభూషన్, బొత్స.శ్రీనివాసరావు, దత్తి గోపాలకృష్ణ, దండేల సతీష్, అన్ను రామకృష్ణ, కలిపిల్లి సింహ చలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way