వైసీపీ పార్టీ సమావేశాలకు దేవాలయాలను వాడుకోవడం సిగ్గుచేటు : జనసేన నాయకులు సి. కృష్ణయ్య
ఈ రోజు హిందూ దేవాలయంలో పవిత్రమైన కనకదుర్గమ్మ ఆలయంలో దేవాలయంలో కార్యనిర్వహణ అధికారి మరియు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవస్థానం బోర్డు చైర్మన్ కలిసి వైసీపీ కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చెయ్యటం జరిగింది. ఒక దేవాలయంలో మీరు పార్టీ కి సంబంధించిన కార్యకలాపాలు చెయ్యటం ఎంత వరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తున్నాము అని తిరుపతి జనసేన నాయకులు సి. కృష్ణయ్య ప్రశ్నించారు. అలా చెయ్యవచ్చునని మీరు సమర్ధించుకుంటే దానికి మీరు జవాబు చెప్పాలి. మీరు చేసే ఈ దుశ్చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయని అన్నారు. మీరు హిందూ ధర్మస్తుల మనోభావాలు దెబ్బ తియ్యటమే కాకుండా, హిందూ దేవాలయాల పవిత్రతను అపహాస్యం చేస్తున్నారు. దీనిని నేను జనసేన తరపున ఖండిస్తున్నామని అన్నారు. దేవస్థానం ఏవో గారు, మంత్రి గారు హిందువులకు క్షమాపణ చెప్పి అదే విధముగా వారి పదవులకు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని జనసేన నాయకులు సి. కృష్ణయ్య గారు కోరారు.