Search
Close this search box.
Search
Close this search box.

మంత్రి జోగిరమేష్ రాజకీయ జీవితం భూస్థాపితం కావడం తథ్యం

     అనంతపురం ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ పై అనిచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ పై తీవ్రస్థాయిలో వాసగిరి మణికంఠ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ మీ నాయకుడు మెప్పుకోసం పవన్ కళ్యాణ్ మూడు పిల్లల గురించి మాట్లాడడం కాదు, చేతనైతే నీ గృహ నిర్మాణ శాఖ గురించి మాట్లాడు. మీ నాయకుడు సీఎం అయిన వెంటనే రాష్ట్రంలో 28 లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు, మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయితుంది, మీరు పూర్తి చేసిన ఇల్లు గురించి గవర్నమెంట్ సైట్లో పొందుపరచండి, జగనన్న కాలనీలో మౌలిక వస్తువుల కోసం అనే 34 వేల కోట్లు కేటాయించాం అన్నారు ఇప్పటికీ ఏ కాలనీలో కూడా కనీసం కరెంటు, రోడ్లు, నీళ్లు, వీధి దీపాలు లేవు. జగనన్న కాలనీల కోసం స్థలా సేకరణలో 10 లక్షలు 20లక్షలు విలువ కానీ భూములకు మీ ప్రభుత్వం 60 లక్షల నుండి కోటి రూపాయలు వరకు చెల్లించి వేల కోట్ల రూపాయలు అవినీతికి కుంభకోణానికి పాల్పడింది, మీ జగనన్న ముఖ్యమంత్రి అవుతానే కిడ్కోలు 1₹ రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నాడు, ఇప్పుడు వరకు ఎన్ని ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు వీటన్నిటికీ సమాధానం చెప్పు అంతేగాని నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు, ముఖ్యంగా పదవుల్లో ఉన్న మీరు సరైన భాష మాట్లాడకపోతే ప్రజలే రాబోయే రోజుల్లో ఓటురూపంలో తగిన బుద్ధి చెబుతారు ఇప్పటికైనా మారండి అని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way