Search
Close this search box.
Search
Close this search box.

ఇంగిత జ్ఞానం లేకుండా నిస్సిగ్గుగా మీడియా ముందుకొచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం హేయమైన చర్య

సజ్జల రామకృష్ణారెడ్డి

         అనంతపురం ( జనస్వరం ) : సజ్జల రామకృష్ణారెడ్డి గారు… మీరు కేవలం ప్రభుత్వ సలహాదారులు మాత్రమే, మీరు మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు చేయకూడదు? ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించకూడదు? ఎందుకంటే మీరు ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న డబ్బుల్ని జీతముగా తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో దేవర దున్నపోతులు ఉంటాయి ఆ దున్నపోతులు అన్ని ఇండ్ల కాడ బలవంతంగా మేసి, బలిసి ఆ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటాయి అలాగా ఉంది మీ ప్రవర్తన తీరు!! ఎందుకంటే ప్రజల సొమ్మును జీతాలుగా మీరు తీసుకొని ఆ ప్రజలకు ప్రతినిధులైన వారిని రాజకీయ విమర్శలు చేయడం. కనీసం ఈ ఇంగిత జ్ఞానం లేకుండా నిస్సిగ్గుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం దారుణం, నీచమైన, హేయమైన చర్యగా మేము భావిస్తున్నామని అన్నారు. నిన్నటి రోజున మీరు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి… ఎవరో స్క్రిప్ట్ ప్రకారం జనసేనని నటిస్తారు అని చిలక పలుకులు పలకడం దుర్మార్గమైన చర్య. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని వ్యవస్థలపైన.. అంశాల పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవాల్సిన స్థితిలో లేరు, గత ఏడేళ్లుగా ఇదే విషయాలు చెబుతూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు. మీ దొంగల ముఠా నాయకుడు లాగా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే వేదిక పైన చదవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నామన్నారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు… దూరేది గుడిసెల్లేకి ఉన్నట్టుగా మీ ప్రవర్తన తీరు ఉంది. ఇప్పటికైనా మీరు బాధ్యత గుర్తిరిగి ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వానికి మాత్రమే సలహాలు ఇవ్వండి, మీరు రాజకీయ విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way