SPO లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యటం బాధాకరం : జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు

జనసేన

       అవనిగడ్డ ( జనస్వరం ) : సరిహద్దుల్లో మద్యం, గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు విధులు నిర్వహిస్తున్న ఎస్పీవోలను తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయటం చాలా బాధాకరమని అవనిగడ్డ జనసేనపార్టీ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు ఖండించారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్పీవోలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ మద్యం షాపులు నుండి సాయంత్రంకు బార్ లకు, గ్రామాలకు చేరిపోతున్నది. బెల్ట్ షాపులు లేవు అన్న పేరేగాని అంతకన్నా ఎక్కువుగా అక్రమ మద్యం వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో షాపులు ద్వారా అమ్మే దానికన్నా బయట గ్రామాలలో ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో spo లను రద్దు చెయ్యటం వలన గ్రామాలలో అక్రమ మద్యం ఏరులు అయ్యి పారుతుంది. నిరుపేద కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్స్ను (SPO) తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చెయ్యటంలో ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలి. అయితే గత కొన్ని నెలలుగా తమకు వేతనం ఇవ్వటంలేదని సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరిని తొలగించటం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో పునరాలోచన చెయ్యాలిని జనసేన పార్టీ తరుపున ప్రభుత్వంను అధికారులను కోరుచున్నామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way