గూడూరు పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి : జనసేన నాయకులు

      గూడూరు, (జనస్వరం) : గూడూరు పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలో కొన్ని ప్రాంతాలలో మునిసిపల్ తాగునీరు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారని, తాగు నీరు రాని ప్రాంతాల్లో వాటర్ టాంకర్ల ద్వారా మంచినీరు పంపిణి చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా క్రోనో కార్పస్ మొక్కలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రకటించి ఉండడంతో గూడూరు మున్సిపాలిటీ పరిధిలో డివైడర్లు మీద ఏర్పాటు చేసి ఉన్న క్రోనో కార్పస్ మొక్కలు వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. అలాగే దోమల నివారణకు ఫ్యాగింగ్, ఆయిల్ బాల్స్, స్ప్రై చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు యనమల విజయ్ కార్యదర్సులు మట్టిపాటి సనత్, పునగటి అవినాష్, శివ, శ్రీనాథ్, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way