Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యులకి మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

ఇన్సూరెన్స్

    ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు అల్లం రామశేషయ్య తనయుడు అల్లం దామోదర్ కి, బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామనికి చెందిన దారా శివయ్య కి ఇటీవల ప్రమాదానికి గురవడం జరిగింది. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అల్లం రామశేషయ్య గారికి రూ 50,000/- విలువ చేసే చెక్కును అదేవిధంగా దారా శివయ్య గారికి రూ 24890/- విలువ చేసే చెక్కును చిలకం మధుసూదన రెడ్డి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కష్టకాలంలో జనసేన పార్టీ అండగా నిలుస్తుందని క్రియాశీలక సభ్యత్వానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉందన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, చిలకం మధుసూదన రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way