అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేనపార్టీకి చెందిన ఈశ్వర రావు శారద దంపతులు
ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం గొల్లకంచిలి లో అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన నెయ్యల శేఖర్ దంపతులకు కంచిలి మండల జడ్పిటిసి అభ్యర్థి డొక్కరి ఈశ్వర రావు శారద దంపతులు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్ట పరిహారం అందేటట్టు కృషిచేస్తానని జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు గారు అన్నారు. ఎప్పుడు ఎవరికి ఏం సహాయం కావాలన్నా ముందు ఉండే పార్టీ జనసేన పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జడ్పిటిసి అభ్యర్థి తిప్పన సభ్యులు దుర్యోధన రెడ్డి గారు, కంచిలి ఎంపీటీసీ అభ్యర్థులు సుశీల గాంధీ, సోమేశ్ క్రాంతి వేణు ఢిల్లీ కోదండ, రొక్కల భాస్కరరావు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు