ఇది ప్రజాస్వామ్యమా జగన్ రెడ్డి జాగీరా : జనసేన నాయకులు భూపతి మురళి మోహన్

జగన్

          ఒంగోలు ( జనస్వరం ) : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమంలో భాగంగా వైజాగ్ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అక్రమంగా నిర్బంధించి మరియు అక్రమంగా జనసేన నాయకులను అరెస్ట్ చేయడం చూస్తుంటే మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనిపిస్తుందని నాగులుప్పలపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు భూపతి మురళి మోహన్ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం పబ్బం గడుపుతున్న ఈ జగన్ రెడ్డి కీ ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని, ఈ జగన్ రెడ్డి కీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ధ్యాస లేదు ఉన్న ధ్యాస అంతా ఒకటే ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ, వారిని ఇబ్బంది పెట్టడమే పని గా పెట్టుకున్నారు. ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం లో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి.  ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం లో రైతన్నకు భరోసా లేదు, మహిళలకు భద్రత లేదు, యువతకు భరోసా లేదు, అలాంటి ఈ తరుణం లో ప్రజా సమస్యల పై పోరాడుతూ ప్రజల్లో ఆదరణ పొందుతున్న జనసేన పార్టీని చూసి ఓర్వలేక ఎక్కడికి అక్కడ జనసేన నాయకులు మీద, కార్యకర్తల మీద, వీర మహిళల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఉత్తరాంధ్రలో అరెస్టు చేసిన జనసేన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షం లో అధినేత పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way