Logo
Date of Publish : 01 December 2021, 2:44 pm
Editor : Sake Naresh

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు? ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేనపార్టీ ఇంఛార్జ్ ఆకుల సుమన్

     హన్మకొండ, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల, గ్రామీణ ప్రాంతాలలో చేతికందిన వరి ధాన్యం అమ్ముదామని రోడ్లపై కల్లాలో ఉంచి రాత్రనక, పగలనక కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలంలో ఆరు నెలల కాలం కష్టించి పండించిన పంటను అమ్ముదామంటే ఇంకా ధాన్యం కొనుగోల కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, అకాల వర్షాలతో ఆగమౌతున్న ధాన్యం రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ రైతుల జీవితాలతో చెలగాటమడుతోందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ ఆకుల సుమన్ తీవ్రంగా విమర్శించారు. గత రెండు రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి వరి సాగు వడ్లు కొనుగోలుపై చేతులెత్తేయడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వర్షాకాలం ధాన్యంతో పాటు యాసంగి వడ్లు కూడా చివరి గింజ వరకు ప్రభుత్వాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com