Search
Close this search box.
Search
Close this search box.

ట్రాన్స్ఫార్మర్ అనుకొని శిలాఫలకం వేయడం అవసరమా?

– వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ ఆఫీసును కుట్రపూరితంగా కొట్టేయాలనుకోవడం నిజం కాదా?
– చిట్టి కాంగ్రెస్ ఆఫీసును, అమ్మవారి దొడ్డిని కొట్టేసి వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నారు.
       విజయవాడ, (జనస్వరం) : ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని శిలాఫలకం వేయడం అవసరమా? అని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట్ మహేష్ అన్నారు. మంగళవారం ఉదయం 53వ డివిజన్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని శిలాఫలకం వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఈ ప్రాంతంలో లారీలు మినీ లారీలు తిరుగుతూ ఉంటాయని, ట్రాన్స్ఫార్మర్ కు ఏదైనా రిపేర్లు చేయవలసి వస్తే శిలాఫలకం అడ్డంగా ఉందని, ఈ శిలాఫలకం ఏర్పాటు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీల ద్వారా మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని, అమ్మవారి దొడ్డిని తన బినామీల ద్వారా కుట్రపూరితంగా కొట్టేసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలనుకున్నారని, కానీ చిట్టి కాంగ్రెస్ పెద్దలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పటికే వెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో అనేక ప్రభుత్వ భూములను కాజేసి తన ట్రస్ట్ లో కలిపేసుకున్నారని, వాటిలో భాగంగానే పురావస్తు, ఇరిగేషన్, కార్పొరేషన్, కార్మిక శాఖకు చెందిన భూముల్ని కబ్జా చేశారని ఇప్పుడు మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయం వంతు వచ్చిందన్నారు. ఇక్కడ కావాలని శిలాఫలకం వేశారని రోడ్డు చివరు వేస్తే వారికి వచ్చే ఇబ్బందేంటో వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way