క్రాప్ హాలిడే లాగా అవినీతికి హాలిడేనా : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

క్రాప్ హాలిడే

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 213వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రోజుల పాటు అవినీతికి దూరంగా ఉండాలని సీఎం జగన్ తమ మంత్రులకు హితవు పలికినట్లు వార్తలు రావడం చూస్తుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం అవుతోందన్నారు. రైతులకు కొన్ని సీజన్లలో ఉండే క్రాప్ హాలిడే లాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మంత్రులకు, ఎమ్మెల్యేలకు అవినీతి హాలిడే ప్రకటించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మితిమీరిన అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని కొల్లగొట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దివాళా తీసిందని, ఈ ప్రభుత్వ అవినీతికి ప్రజలు వేసారి పోయారని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై సర్వే నివేదికలు తెప్పించుకుని అవినీతి హాలిడే ప్రకటించడం కాదని అసలు అవినీతి అక్రమాలు లేని పారదర్శకమైన పాలనని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అటువంటి పారదర్శక పాలన అందించగల నిజాయితీపరుడు ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే సీఎం పవనన్నే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way