Logo
Date of Publish : 02 July 2026, 7:15 pm
Editor : Sake Naresh

సమిష్టి కృషి తోనే అంతర్జాతీయ గుర్తింపు – అభినందన సభలో ఆవుల చంద్రశేఖర్ వెల్లడి

విజయవాడ, జులై 02, జనస్వరం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టికృషి తోనే తనకు అంతర్జాతీయ అవార్డు దక్కిందని ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆవుల చంద్రశేఖర్ అన్నారు. లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హాల్ లో "వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్" వారి అంతర్జాతీయ అవార్డును ఇటీవల అందుకుని గురువారం తొలిసారిగా కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. అనంతరం సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సంయుక్తంగా సిఈఓ చంద్రశేఖర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందనసభలో ఆయన మాట్లాడుతూ, తన విజయం వెనక ఎందరో కృషి దాగి వుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ రికార్డు సాధించేలా ప్రోత్సహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ కు, వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ, ఆయుష్, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనాశాలలు, మార్కెటింగ్ సంస్థల సహకారం మరువలేనిదన్నారు. ప్రజారోగ్యం కోసం భారతీయ సనాతన వైద్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి తన అవార్డు అంకితమన్నారు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన 10వ సమ్మిట్ - అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన హౌస్ ఆఫ్ కామన్స్, ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో ఘనంగా నిర్వహించిందన్నారు. ఈ విశిష్టమైన వేడుక, యూకే (యునైటెడ్ కింగ్‌డమ్), యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా), రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, నేపాల్, కజకిస్తాన్, కెనడా, మెక్సికో, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ, ఈజిప్ట్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాల నుండి వచ్చిన అత్యుత్తమ వ్యక్తులు, సంస్థలను సత్కరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రజా సేవ, దౌత్యం, వ్యాపార రంగాలలో రాణించిన వారిని కీర్తించిందన్నారు.

ఈ వేడుకలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) సంస్థ సిఈఓ సంతోష్ శుక్లా, రాజేష్ శుక్ల, బ్రిటన్ పార్లమెంటు సభ్యులు గరేత్ బకాన్, వీరేంద్ర శర్మ, మిస్ ఇంగ్లాండ్ లిమిటెడ్ డైరెక్టర్ యాంజీ బిస్లె తదితరులు అవార్డును అందజేశారని తెలిపారు. ప్రపంచ ప్రముఖులు, క్యాబినెట్ మంత్రులు, దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ వ్యాపార నాయకులు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని, విభిన్న దేశాలు, రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ వేడుక, అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించి, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ప్రపంచ ఐక్యత, గుర్తింపు, పురోగతిని ప్రోత్సహించడంలో ఈ వేడుకల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా సభలో ప్రకటన చేశారన్నారు. ఈ వేడుక శ్రేష్ఠతను గౌరవించడమే కాకుండా, ప్రపంచ పరివర్తన దిశగా సామూహిక బాధ్యతను ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. దాని అంతర్జాతీయ ప్రభావం, ఉన్నత స్థాయి భాగస్వామ్యంతో, 10వ సమ్మిట్ - అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్ నడిబొడ్డున ఒక మైలురాయి సమావేశంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ప్రదీప్, బోర్డు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com