Search
Close this search box.
Search
Close this search box.

పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు మత్స్య పుండరికం గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు

    పాలకొండ, (జనస్వరం) : అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వీరఘట్టం మండలం నడుకూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సరస్వతి దేవి విగ్రహం, తెలుగు తల్లి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మత్స పుండరికం మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మననది – మననుడిలో భాగంగా అంతరించిపోతున్నయని, వాటిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. మాతృభాషతోనే విజ్ఞానాభివృద్ధి జరుగుతుంది. మన సాంస్కృతి, ఆచారం, కుటుంబ పద్ధతులు అన్ని మాతృభాషలొనే అర్ధం చేసుకోగలం. పరాయి భాష మోజులో పడి మాతృభాషను చిన్నచూపు చూడకూడదు. మన మాతృభాషను ప్రతిఒక్కరు రక్షించుకోవాలని జనసేన పార్టీ మండల నాయకులు మత్స పుండరీకం అన్నారు. అంతకుముందు విద్యార్థులకు మననుడి – మనబడి, మన మాతృభాష – తెలుగు భాష అంశాలపై 6,7,8,9, తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు పోటీలో పాల్గొన్న విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటు మురళి, సాధు విశ్వేశ్వరరావు, కర్ణేన పవన్ సాయి, వావిలపల్లి నాగభూషణం, దత్తి గోపాలకృష్ణ, వావిలపల్లి విస్సు, వాన కైలాష్, వాన మహేష్, కలిపిల్లి సింహాచలం, రౌతు గోవింద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way