Logo
Date of Publish : 20 November 2023, 10:48 pm
Editor : Sake Naresh

వైఎస్ఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి : గురాన అయ్యలు

     విజయనగరం ( జనస్వరం ) : వైఎస్ఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన నేత గురాన అయ్యలు కోరారు...ఈమేరకు సోమవారం స్పందనలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ విజయనగరం పట్టణ పరిధిలో వైఎస్ఆర్ నగర్ ఏర్పడి 14 సంవత్సరాలు అవుతున్నా ,మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. సుమారు 2500 నివాస గృహాలను కలిగి ఉన్న వైఎస్ఆర్ నగర్ లో కాలువలు, రోడ్లతోపాటు రక్షిత మంచి నీటి కోసం ట్యాంకు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీధి దీపాలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయన్నారు. మురుగు నీరు రోడ్లపై నిల్వవుండడంతో పందులు, దోమలు కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారన్నారు. పలుమార్లు సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిని అందించామని, అయినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పిడుగు సతీష్ , టి.రామకృష్ణ,
కాటం అశ్విని, పితాల లక్ష్మీ, ఏంటి రాజేష్, ఎల్ .రవితేజ, అడబాల వేంకటేష్, దుప్పాడ నరేష్, ఎమ్ .పవన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంది సురేష్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com