Logo
Date of Publish : 08 October 2020, 7:55 am
Editor : Sake Naresh

నర్సింగపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించండి : టెక్కలి జనసైనికులు

నర్సింగపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించండి : టెక్కలి జనసైనికులు

                       టెక్కలి నియోజకవర్గం నర్సింగపల్లి పంచాయతీ సమస్యలపై ఎంపిడిఓ కార్యాలయంలో పరిపాలన అధికారి హెచ్ వీ రమణమూర్తికి గురువారం జనసేన పార్టీ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు వినతిపత్రం అందజేశారు. టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయితీ నందు ఎస్సి కాలనీలో నివసిస్తున్న అనేక కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక ఇబ్బంద్దులకు గురవుతున్నాయి. త్రాగు నీటి సదుపాయాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామంలో పారిశుధ్య నిర్లక్ష్యం వలన అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజిలు లేక ఇళ్లలోని మురికి నీరు వీధుల్లోకి వ్యాపించి నిల్వ ఉండిపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. గ్రామ పెద్దలు పలుమార్లు ఈ సమస్యలపై గ్రామ అధికారుల వద్ద మొర పెట్టుకున్నా పట్టించు కోవటం లేదని వాపోతున్నారు. ఈ సమస్య పై ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పసుపు రెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, సంజు రెడ్డి, తోట శ్యామ్, వాకాడ క్రిష్ణ, హనుమంతు దిలిప్ తదితరులు పాల్గొన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com