Search
Close this search box.
Search
Close this search box.

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలోకి మహిళల చేరికలు

నెల్లూరు

      నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు జిల్లా మహిళా నాయకులు కోలా విజయలక్ష్మి, పసుపులేటి సుకన్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వారితో మాట్లాడుతూ పార్టీలో మహిళా కార్యకర్తలు పాత్ర ముఖ్యమైనదని అన్నారు. కుటుంబ బాధ్యతలను ఎంతో చాకచక్యంగా నిర్వహించగలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. రానున్న జనసేన కమిటీలలో కీలక బాధ్యతలు కేటాయించనున్నామనీ, ప్రతి గడపకి పార్టీ సిద్ధాంతాలను, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రతి గడపకు చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కృష్ణ పెన్నా మహిళా ప్రాంతీయ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి పసుపులేటి సుకన్య, పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way