Search
Close this search box.
Search
Close this search box.

అనంత జనసేనలోకి వైసిపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేరిక

     అనంతపురం ( జనస్వరం ) : పుట్టపర్తి ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్  ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై అనంతపురము జిల్లాలో పలువురు జనసేన పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలానికి చెందిన వైసిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం అనంతపురము జిల్లా కేంద్రంలోని రాంనగర్ కార్యాలయంలో పుట్టపర్తి ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ సీనియర్ నాయకులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  టీ.సీ.వరుణ్ మాట్లాడుతూ… పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. మీకు అన్నివేళలా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తారని  పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. పార్టీలోకి చేరిన వారిలో సీనియర్ నాయకులు కమ్మల నరేష్, కె.వి.శివప్ప, డి.మహేష్ రెడ్డి, రాజా,  ఎం.హరి, శ్రీకాంత్, హరి ప్రసాద్, సంపత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way