అట్టహాసంగా పూసపాటిరేగ మండలం జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం 

       నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గం పూసపాటిరేగ మండలం పూసపాటి గ్రామంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం నియోజకవర్గ ఇన్చార్జ్  లోకం మాధవి గారి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల జనసేన సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు వీర మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పూసపాటిరేగ జంక్షన్ నుంచి ర్యాలీగా సుమారు 500 మంది ప్రజలతో శ్రీమతి లోకం మాధవి గారిని హారతులు మరియు పూలమాలలతో ఆహ్వానం పలికారు. లోకం మాధవి మాట్లాడుతూ పూసపాటిరేగలో కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మండల కార్యవర్గ సమావేశాలు నూతనంగా ప్రారంభించిన కార్యాలయంలోని ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు వీర మహిళలకు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ 2019లో మహిళలను యువతను మాయమాటలు చెప్పి నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చాడని వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకొని ఇప్పుడు రకరకాల పనులకు వారిని వినియోగించి మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం పేరు చెప్పి మహిళలకు మోసం చేసి కల్తీ మధ్యన అంటగట్టి ప్రజల్ని దగ్గర డబ్బులు దోచేస్తున్నారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వ స్థాపనకు తమకు పూర్తి మద్దతు తెలియజేయాలని ప్రజలకు కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way