మాడుగులలో కరోనాతో మరణించిన జనసైనికుడి కుటుంబానికి రూ. 23,000 ఆర్థిక సహాయాన్ని అందించిన జనసైనికులు

              ఇటీవల అడవిల అగ్రహారం గ్రామంలో కరోనా బారిన పడి చనిపోయిన పడాల దర్గాలు కుటుంబానికి మాడుగుల నియోజకవర్గం జనసైనికులు సహకారంతో 23000 రూపాయలు నగదుతో పాటు నెల రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు జనసైనికుల సమక్షంలో అందించడం జరిగింది. అంతేకాక ముందు ముందు బాధిత కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తామంతా అండగా ఉంటామని జనసైనికులు తెలియ చేశారు. మాడుగుల నియోజవర్గంలో నియోజకవర్గ ఇంచార్జి లేనప్పటికీ జన సైనికులకు ఏ ఆపద వచ్చినా తోటి జనసైనికులు అందరూ ముందుకు వచ్చి వాళ్ల కుటుంబానికి అండగా ఉంటూ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క జన సైనికుడు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు గారు, అగ్రహారం ex సర్పంచ్ నానాజీ గారు, బైలపూడి వైస్ ప్రెసిడెంట్ సంతోష్, కాపు సంక్షేమ సేన మాడుగుల నియోజకవర్గ యువజన అధ్యక్షుడు G V మూర్తి అలాగే జనసైనికులు కృష్ణ, అప్పారావు, మహేష్, శివ, స్వామి, విజయ్, రాము, నిరంజన్, వాసు, రమేష్, రాంబాబు మరియు నాలుగు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.