పల్లెపొరులో గాంధీ జయంతి సాక్షిగా వైసీపీ సర్కారుపై ఘాటు విమర్శలు

వైసీపీ

      తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం రావిపాడు గ్రామ పల్లేపోరులో భాగంగా ముందుగా గ్రామ పెద్దలతో కలిసి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జై జవాన్ , జై కిసాన్ అంటూ దేశ ప్రజల్లో ప్రధానిస్ఫూర్తి రగిలించిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈ రోజే అవ్వడం,అహింసే పరమ ధర్మంగా సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్ముని జయంతి సందర్భంగా వారిరువురికీ శ్రీనివాస్ నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రజల ఉద్దేశించి సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ అని అహింసా యుత ప్రజా పోరుతో పరాయి పాలన నుండి భారతదేశాన్ని విముక్తం చేశారని పేర్కొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్ముడిని స్మరించుకుంటూ మనస్పూర్తిగా అంజలి ఘటిస్తున్నాను అని స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ గురించి మాట్లాడుతూ బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉంటాయనీ వచ్చే ఎన్నికలలో జనసేన పథకాలు గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ రావిపాడు గ్రామంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ గ్రామం లో పల్లెపోరును ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way