Search
Close this search box.
Search
Close this search box.

వృద్ధాప్యంలో రామకోటి రాసుకో ముద్రగడ పద్మనాభం….

ముద్రగడ పద్మనాభం

           సర్వేపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో రామకోటి రాసుకోవాల్సిన ముద్రగడ పద్మనాభం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం మీకు అంత మంచిది కాదు. తునిలో 12 లక్షల మంది కాపులు మీకు మద్దతుగా నిలబడితే మీరు కాపులకు చేసింది ఏంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం రూ.2000 కోట్ల రూపాయల నిధులు కాపు కార్పొరేషన్ కి కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు దానికి స్వేత పత్రం విడుదల చేసింది లేదు. మరి ఆ రోజు ఎందుకు మీరు లేఖ రాయలేదు. కాపు రిజర్వేషన్ గురించి ఎక్కడా కూడా ఇప్పటివరకు ప్రస్తావన జరగలేదు. దాని గురించి ఎందుకు మీరు లేఖ రాయలేదు. వైసీపీ వాళ్లు మాట్లాడితే వేదాంతలు, మా అధినేత మాట్లాడితే బూతులా, ఆడపడుచులపై, వీర మహిళలపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వైసిపి ఎమ్మెల్యే కించపరిచే విధంగా మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పెడితే, మరి ఆరోజు ఎందుకు మీరు లేఖ రాయలేదు. ఇంకా చాలించు ముద్రగడ గారు మీ ముసుగు రాజకీయం, మీరు మీ స్వలాభం కోసం, మీరు ఏదైతే తునిలో ఉప్మా పెట్టిచ్చాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్యమంలో అని చెప్పారు. ఆ ఉప్మాకి అయిన ఖర్చులో భాగంగా మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరు పది రూపాయల లెక్కన మీకు పోస్ట్ ద్వారా పంపిస్తున్న స్వీకరించండి. అంటే ఎప్పుడు కూడా ముసుగేసుకుని రాజకీయాలు చేయబాకండి, నీతి నిజాయితీగా ఇకనైనా సరే ఇంత వయసు వచ్చింది కళ్ళు తెరిచి కాపులకి మీరేం చేశారు. ప్రభుత్వం ఏం చేసింది మరి ఎందుకు చేయలేకపోయింది అనేటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం మీద ఉన్న శ్రద్ధ బూతులు మాట్లాడే మంత్రులకు ఎందుకు రాయలేదయ్యా, ఎమ్మెల్యేలకు ఎందుకు రాయలేదయ్యా అంటే అవి మీకు బూతులుగా వినిపించడం లేదా ఇకనైనా చాలించండి. కృష్ణా రామా అనుకుంటూ ప్రశాంతంగా ఉండండి అంతేకానీ బురదజల్లే పనులు చేయబాకండి. ప్రశాంత్ కిషోర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఎలా చెప్తే అలా ఆడే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. మీ ఆటలు ఇంకా సాగవు. జగన్మోహన్ రెడ్డి ఊబిలో చిక్కుకొన్న మీరు చివరకు కాపు ద్రోహిగా నిలవకండి. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరి, మస్తానయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way