నెల్లూరులో మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి 60 మంది చేరిక

నెల్లూరులో మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి 60 మంది చేరిక

       జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సమక్షంలో జనసేన నాయకులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి 60మంది కార్యకర్తలు జనసేనలో చేరి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. మనుక్రాంత్ గారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారి ఆశయాలకై యువత పార్టీ లో చేరుతున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నామని, కరోనా సమయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామనీ, రైతులకోసం పోరాటం చేశాము.  ఇంకా జిల్లాలో ప్రజలకోసం పలు సమస్యలపై పోరాటం చేస్తాము అని అన్నారు. గతంలో పార్టీ తరపున పని చేసి గుర్తింపు కోసం చూస్తున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యుల నమోదు మంచి కార్యక్రమం అని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున గతంలో సేవ చేసిన ప్రతీ కార్యకర్తలను గుర్తించి సభ్యత్వం నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు, జిల్లా నాయకులు గునుకుల కిషోర్, సుజయ్ బాబు, ప్రశాంత్ గౌడ్, సుల్తాన్ బాషా, షాజహన్ తదితరులు పాల్గొన్నారు.