తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరుపున మున్సిపల్ ఎన్నికల పోరులో అత్యధికంగా జనసేన వీర మహిళలు

             తూర్పుగోదావరి జిల్లాలో ఎలక్షన్ జోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి అధిక శాతం మహిళలకు రిజర్వేషన్లు దక్కడంతో జనసేన పార్టీ తరుపున కాకినాడ వీరమహిళా విభాగం తరుపున కాకినాడ మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబెర్ పోలసపల్లి సరోజ, జిల్లా వీరమహిళలతో కలిసి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, అమలాపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ అధికార పార్టీ ఇతర పార్టీలు ఎన్నో ఒత్తిళ్లు కలిగించినా ఎదుర్కొని నిల్చున్న మహిళా అభ్యర్థులను అభినందించారు. నేడు జరగనున్న ఎన్నికల్లో అధికశాతం ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. నిన్నటి వరకూ నిర్వహించిన రోజు వారి ప్రచారాల్లో వీరమహిళలు అందరూ ప్రచారాలు చేస్తూ సహకారాలు అందిస్తూ తమదైన శైలిలో ఎన్నికల పర్వాన్ని ముందుకు నడిపిస్తూ అలాగే 80 సంవత్సరాల వృద్ధురాలు పోటీలో నిల్చున్నారు అంటే అది తమ అధినేత పవన్ కళ్యాణ్ నింపిన స్పూర్తితోనే సాధ్యం, ఆ స్పూర్తితోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way