Search
Close this search box.
Search
Close this search box.

అనంతపురంలో ఇంటింటా జనసేనకు విశేష ఆదరణ

అనంతపురం

          అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా అనంతపురం నియోజకవర్గంలో రామచంద్ర నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో తిరిగి క్రియాశీలక సభ్యులను కలిసి “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ మెరుగు శ్రీనివాస్, భవాని నగర్ మంజునాథ్, హితేంద్ర చౌదరి, ప్రవీణ్ కుమార్, అమర్నాథ్ రాయల్, వెంకటాద్రి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way