ఆమదాలవలస, (జనస్వరం) : జనసేన అధినేత గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస టౌన్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గములో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. యువత మరియు మహిళలు కలిసి ఉత్సాహంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com