ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గము, బూర్జ మండలం, పనుకుపర్తి గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో 13 సంవత్సరాలు చిన్నారి ఢిల్లీశ్వరి (మేఘన) చనిపోయింది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర & కోరుకొండ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి, ఎల్లవేళలా జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం కూడా అందినంత వరకు అన్ని విధాలుగా, జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని మాటివ్వడం జరిగింది. అలాగే చిన్నారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి, ముందుకు వచ్చినటువంటి మన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపిటిసి అంపిలి విక్రమ్, జనసేన పార్టీ నాయకులు రాజేష్, మౌళి, సంఘం నాయుడు, నరేష్, శ్రీను, గణేష్, ఆనంద్, సురేష్, కాశీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com