Search
Close this search box.
Search
Close this search box.

అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఆరికట్టాలి : జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

      సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలని   మండల రెవెన్యూ అధికారికి సోమవారం స్పందనలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో పొదలకూరు పంచాయతీకి కుసింత వేటు దూరంలో ఉన్న చిట్టేపల్లి తిప్ప సర్వేనెంబర్ 707లో గతంలో ఋషికొండ టూ ను తలపించే విధంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే అప్పట్లో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో ఆపారు. మళ్లీ గత మూడు రోజుల నుంచి చిట్టేపల్లి తిప్పలో ఇదే గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. అప్పుడు టిప్పర్లతో తోలకాలు జరిగితే ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా తోలకలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మోపాలని స్పందనలో ఆర్జీ ఇవ్వడం జరిగింది.   మీరు గాని ఈ గ్రావెల్ మాఫియా దందా పైన ఉక్కు పాదం మోపకుంటే జనసేన పార్టీ ఆందోళన చేస్తుందని సవినయంగా చేస్తున్నాం. అదే విధంగా ఈ గ్రావెల్ మాఫియా దందా వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసని ఒక సామాన్యుడు ఒక ట్రక్కు మట్టి తోలుకోవాలంటేనే మండల కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి ముగించుకోవాలి. అటువంటిది పర్మిషన్ లేకుండా తిప్పల పైన ఉన్న గ్రావెల్ మొత్తాన్ని దోచుకుపోతుంటే ఎందుకని ప్రభుత్వాధికారులు వీళ్ళ పైన చర్యలు తీసుకోరు అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, సహజవనులను దోచుకునే వారిపై చర్యలు తీసుకోండని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువత పొదలకూరు మండల అధ్యక్షుడు సంజు రాకేష్, శ్రీహరి, చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు ఖాజా, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way