Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే గుడ్డలు ఊడదీసి కొడతాం

పవన్ కళ్యాణ్

   కళ్యాణదుర్గం ( జనస్వరం ) :  కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో R&B గెస్ట్ హౌస్ “జన సైనికుల ఆత్మీయ సమావేశం” ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కేవలం 1400 మంది కాదు 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి ఇంకా పెండింగ్ లోనే ఉంది అది ఏం చేశారు, నిన్నటి రోజు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సరైన వేతనాలు లేవని నిరసన ర్యాలీలు చేశారు. వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి వ్యక్తిగత జీవితం గురించి ఆయన పెళ్లిళ్లు గురించి దారుణంగా విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఒక గ్రామ వాలంటీర్ మహిళకు రావలసిన పెన్షన్ డబ్బులు కాజేసి పరారయ్యాడు, బెలుగుప్ప మండలంలో సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామ వాలంటీర్లు అందరూ సచివాలయంలోనే మందు తాగి డాన్స్ చేశారు. రోజాకు మంత్రి పదవి వచ్చిన ప్రారంభంలో రాష్ట్రంలో ఒక వారంలోనే ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి రోజాగారు అని అడిగితే “రెండు మూడు రేప్ లకే ఇంత రాద్ధాంతమా”అని రోజా గారు మాట్లాడడం కరెక్టేనా? మీ ఇంట్లో ఆడ పిల్లలకు ఇలాగే జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా రోజా పువ్వు గారు. మీరు మహిళ రోజా కాదు బ్రోకర్ రోజా జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరిస్తున్నాము.  ఇలాంటి వారిపైనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. నిన్నటి రోజు నిరసన చేసిన వాలంటీర్లందరికీ ఇవి తేలిదా? మీరు ఇప్పటికైనా మారకపోతే మీ బ్రతుకులు ఇంతే! మీరు వైసీపీకి బానిసలు గానే ఉండిపోతారు. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు ఇవన్నీ నీకు కనిపించలేదా ఎక్కడున్నావు? ఎవరితో ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీకు ఇంగిత జ్ఞానం ఉందా? అని అడుగుతున్నాము. అలాగే ఈ రాష్ట్ర వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు “కాగ్” నివేదిక ప్రకారం ఎంత అప్పు తీసుకున్నారు? ఎంత ఖర్చు పెట్టారు? ప్రెస్ మీట్ పెట్టి లెక్కలు చెప్పండి అంటే చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీరు మంత్రులు కాదు కంత్రిలు! ఇంకొకసారి జనసేన పార్టీ పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ అనవసరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ విమర్శిస్తే చోక్కాలు ఊడదీసి కొడతాము కబాడ్దార్! అని వాలంటీర్లను, వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులను, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మను మేము కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ గారు, బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ కార్యదర్శులు రాయుడు గారు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ నాయకులు వంశి గారు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ గారు, శెట్టూరు మండల నాయకులు కాంత్ రాజు గారు, జిల్లా జనసేన వీర మహిళ షేక్ తార గారు, విట్లంపల్లి ముక్కన్నగారు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way