మెగాఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తాం : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు)

● సీపీఐ నారాయణ, చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా చిరంజీవి యువత, జనసేన నాయకులు

● సీపీఐ నారాయణ మాటలను వెనక్కి తీసుకోవాలని జిల్లా చిరంజీవి యువత, జనసేన నాయకులు డిమాండ్

       విజయనగరం, (జనస్వరం) :  ప్రముఖ సినీనటులు, మాజీ రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి నారాయణ వాఖ్యలపై ఖండించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద అంబేద్కర్ సామాజిక భవనంలో మీడియా సమావేశంలో ముందుగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మా ఆరాధ్యాదైవం, మా అభిమానుల సేవలకు మార్గదర్శి, మథర్ థెరిస్సా తరువాత సేవలకు ప్రతిరూపమైన చిరంజీవిపై నారాయణ చేసిన వ్యాఖ్యలకు జిల్లా చిరంజీవి యువత తరుపున ఖండిస్తున్నామని, రాష్ట్రాంలో మేము బతికే ఉన్నాం అని పబ్లిసిటీ లేని కుక్కలన్నీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించుకొని పబ్లిసిటీ తెచ్చుకుంటాయాని, అలాంటికోవకు చెందిన కుక్కే ఈ నారాయణ అని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా సినీ కార్మికులను, అభిమానులను,కళాకారులను, తను మాధ్యమాలాద్వారా చలించి ఎంతో లెక్కలేనిమందికి ఆర్ధికంగా ఆదుకునే ఆపద్భాంధువుడని,ప్రపంచానికే ఆదర్శమైన, ఇటువంటి మహనీయున్ని అనటానికి మాటలేలా వచ్చాయిని నిలాదీశారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే నారాయణపై అఖిలభారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ఆదేశాల మేరకు దీనిపై మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా చిరంజీవి యువత కార్యదర్శి డాక్టర్ ఎస్. మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రక్తదానం, నేత్రధానంతో పాటు కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఆక్సీజన్ సిలండర్లు ప్రజలకు అందించి ప్రాణదాతగా నిలిచి, మాకు అభిమానులకు స్ఫూర్తి ప్రధాతగా ఉన్న మా దైవం చిరంజీవిని నారాయణ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మా మెగాఫ్యామిలీ హీరోల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాటమే మా ధ్యేయమని, నారాయణ, చిరంజీవి అభిమానులకు క్షమాపణ చెప్పాలని, చిరంజీవిపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇకపై మా మెగాఫ్యామిలీ జోలికొస్తే మెగా అభిమానులు, జనసైనికులు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా చిరంజీవి యువత నాయకులు, జనసేన యువనాయకులు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షులు చెల్లూరి ముత్యాల నాయుడు, సభ్యులు రొయ్యిరాజు, సీర కుమార్, గూడ రాజేష్, జడ్డు జనా, గాడి బంగార్రాజు, చుక్క రవి, గౌరి నాయుడు, దువ్వి రాము, ఎర్ని బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way