విజయనగరంలో నేను నా నియోజకవర్గం ప్రజలు – 30 వ రోజు

విజయనగరం

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం ఇంఛార్జి  పాలవలస యశస్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర “నేను నా నియోజకవర్గ ప్రజలు” కార్యక్రమం ఎంతో విజయవంతంగా దూసుకు వెళుతూ 30 రోజులు పూర్తయింది. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. జనసేన నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు తోడు రాగా, విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి ఆశీర్వాదములతో అదేరోజు పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటివరకు విజయనగరం లోని 6 డివిజన్లు మరియు 6 గ్రామాలలో ఎంతో విజయవంతంగా పాదయాత్ర పూర్తిచేశారు. అన్ని వర్గాల ప్రజలనుంచి మద్దతు లభించింది. ప్రతీ కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలను ఎంత బెదిరించినా, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, అదే ఉత్సాహంతో ప్రతి కార్యకర్త, నాయకులు మరియు వీరమహిళలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way