Search
Close this search box.
Search
Close this search box.

పల్లెపోరులో నిలిచి ధైర్యం చూపిన జనసేన అభ్యర్థులందరికి సన్మాన కార్యక్రమం

                  పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కు ముగ్దులై  రాజకీయాలను ప్రక్షాళన చేసి మెరుగైన సమ సమాజాన్ని నిర్మిచుటకు జీరో పాలిటిక్స్ చేస్తూ ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల జనసేన తరుపున బరిలోకి దిగి ప్రకాశం జిల్లా లో మొట్టమొదటి పంచాయితి పాత అన్నసముద్రం పాతకొటి వేంకట పద్మావతి గారు  కైవసం చేసుకున్నారు. ఇలాంటి ధైర్యం చూపి నిజాయితీగా నిలిచిన జనసేన అభ్యర్థులందరిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి టీం 99 సన్మానించి రాష్టంలొనే ఒక వినూత్న కార్యానికి శ్రీకారం చుట్టింది ఈ టీం99. ముఖ్య అతిధిగా ప్రకాశం జిల్లా ఇంచార్జ్ షేక్ రియాజ్ గారి చేతులుమీదగా జనసేన అభ్యర్థులకు సన్మానం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు గిద్దలూరు ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు గారు, పర్చూరు నుండి విజయ్ గారు, చీరాల నుండి శివరాం ప్రసాద్ గారు NRI నుండి మరియ టీం99 సభ్యులు మన్నెం శ్రీకాంత్ గారు, కాశీరాం గారు,ప్రకాశం జిలా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు అడుసుమల్లి వేంకట్రావు గారు, అలాగే ఒంగోలు కార్పొరేషన్ అభ్యర్థులు మలగా రమేష్ గారు,బొందుల శ్రీదేవి గారు, నూకల పార్వతి గారు, చెంగలశెట్టి అన్నపూర్ణమ్మ గారు, పిల్లి వైష్ణవి గారు, చిట్టెం ప్రసాద్ గారు, చలపతి రాంబాబు గారు, ఉంగరాల మోహనరావు గారు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way