Search
Close this search box.
Search
Close this search box.

విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి : జనసేన నాయకులు క్రాంతి కుమార్

    చెన్నేకొత్తపల్లి, (జనస్వరం)  : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని చెన్నేకొత్తపల్లి జనసేన మండల కన్వీనర్‌ ఇటీకోటి క్రాంతి కుమార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా ఉదృతిని తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల బంద్‌ చేయించాలని కోరారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్‌ తో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని కరోన నిబంధనలను తప్పక పాటించాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం నాయకులు బోయ హరి, షేకదాదాపీర్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way