హిజాబ్ ధరించడం ముస్లిం మహిళల సాంప్రదాయం : విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్

– హిజాబ్ ధరించడం ముస్లిం మహిళలకు చాలా గౌరవం.
– రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు వారి యొక్క మతాలను గౌరవించుకునటువంటి స్వేచ్ఛ ఉంది.
      విజయవాడ (జనస్వరం) : హిజాబ్ కు మద్దతుగా షేక్ మోబినా, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి పంజా సెంటర్ వరకు వందలాది మంది ముస్లిం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున హిజాబ్ మా సాంప్రదాయ వస్త్రధారణ అని, జీవితాంతం హిజాబ్ ధరిస్తామని పెద్దఎత్తున నినదించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొని ర్యాలీకి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ హిజాబ్ ధరించడం ముస్లిం మహిళల సాంప్రదాయమని, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు వారి మతాలను గౌరవించుకునటువంటి స్వేచ్ఛ ఉందని, దీనికి అడ్డుతగలడం అంత మంచి పద్ధతి కాదని తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకురాలు మోబినా మాట్లాడుతూ హిజాబ్ ధరించడం చాలా గౌరవమని, రక్షణగా ఉంటుందని, వందలాది సంవత్సరాలుగా ముస్లిం మహిళల జీవితంలో ఇది భాగమని, దీనికి ఎవరైనా అడ్డుతగిలితే ఎంత వరకైనా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు షేక్ షర్మిల, రెడ్డిపల్లి గంగాధర్, సోమి. గోవింద్, షేక్ గ్యాయసుద్దీన్, పండు, సయ్యద్ అబ్దుల్ నజీబ్, నూనె. సోమశేఖర్, పొట్నూరి. శ్రీనివాసరావు, సాబింకర్. నరేష్, బుర్లే .శంకర్, మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ షేక్ ఆసిఫ్, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ .పతవుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way