Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘హార్ ఘర్ తిరంగా’ కార్యక్రమం

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo, వీరాఘట్టం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆజాధీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జనసేనపార్టీ నాయకుడు మత్స పుండరీకం ‘హార్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు. నడుకూరు గ్రామాల్లో ఇంటి ఇంటికి, ఆలయాలకి, షాపులకు జాతీయ జెండాలు స్వచ్ఛందగా పంపిణీ చేశారు. అనంతరం పుండరీకం మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేసారని, వారిఅందరి త్యాగ ఫలమే భారతదేశం స్వాతంత్ర్య దేశంగా అవతరించిoది. నాటి స్వాతంత్ర్య ఉద్యమ వీరులకు గుర్తుగా డబ్భై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం – ఆజాధీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జండా రెపరెపలాడలని, భారతదేశం సమైఖ్యత చాటి చెప్పలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, చింత గోవర్ధన్, వాన కైలాష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way