Search
Close this search box.
Search
Close this search box.

దేశ ప్రజలందరికీ ఆనంద హోలీ, ఈ పండుగతో దేశంలో ఐక్యత మరింత పెరగాలి : పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్ దేశినీడి

     పిఠాపురం, (జనస్వరం) : దేశ ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు. రంగుల పండుగ అందరి జీవితాల్లో శాంతి సౌఖ్యాలు నింపాలని ఆకాంక్షింస్తున్నాను. ప్రతీ ఒక్కరు ఆనందకరమైన, సురక్షితమైన, రంగుల హోలీ జరుపుకోవాలి. రసాయన రంగులకు బదులు సహజసిద్ద రంగులతో సురక్షితంగా హోళీని జరుపుకోవాలి. వసంతోత్సవంగా చెప్పుకునే ఈ పండుగ మీ ఇంటికి నిత్య వసంతాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ రంగుల పండుగ ప్రతీ ఒక్కరి ఇంట శుభాలను కలిగించాలి. అనురాగ, అప్యాయతలు కలిసిన పన్నీటి రంగుల జల్లులు. అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం. అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం ఆనందం! రంగులన్నీ వేరుగా కనిపించవచ్చుకానీ, అన్నీ కలిసి ఉంటేనే కంటికి ఇంపు కుటుంబమైనా, దేశమైనా ఇంతే. విడివిడిగా కాదు కలివిడిగా కలిసి ఉందాం. మన జీవితాలను రంగుల మయం చేసుకుందాం. రంగుల పండుగైన హోలీని అందరూ ఆనందంగా, సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోపాలి. మీ జీవితాల్లో ఆనందం నిండాలి. మన సంస్కృతిలో భాగమైన ఈ పండుగతో దేశంలో ఐక్యత మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ సత్యప్రసాద్ హోలి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way