నెల్లూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఫలాలు అందరికీ అందరికీ అందాలన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని, సత్యం అహింస అనే ఆయుధాలుగా స్వరాజ్యం సాధించిన బాపూజీ స్ఫూర్తితో ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అంటూ గునుకుల కిషోర్ ఆధ్వర్యాన జనసేన టీం ర్యాలీ చేశారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ అధ్యక్షులు కంతర్ సమక్షంలో 50 మంది ముస్లిం మైనారిటీలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా వారికి VRC గ్రౌండ్లో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ చేస్తున్న, చేయబోయే కార్యక్రమాలను వివరించడం జరిగింది. తదనంతరం రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ర్యాలీగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ పోకడలను, ధౌర్జన్యాలను ప్రజలకు తెలియజేస్తూ వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీం పూసల మల్లేశ్వరరావు, అలేఖ్, రాజా, కందర్, అమీన్, మనీషా, హేమంత్ మౌనిష్, వర, బన్నీ, సుబ్బు, హరి, డౌలాలి తదితర జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com