Search
Close this search box.
Search
Close this search box.

ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేపట్టిన గుంతకల్లు జనసేనపార్టీ నాయకులు

    గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్ గారి సూచన మేరకు అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ నేతృత్వంలో జగనన్న బాదుడే బాదుడు పథకం ద్వారా పెరిగిన RTC బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని RTC అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆరికేరి జీవన్ కుమార్  మాట్లాడుతూ 2019 లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము, మద్యం దుకాణాలు బంద్ చేస్తాము, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, అక్క ఒక ఛాన్స్, అవ్వ ఒక ఛాన్స్ అని చెప్పి గెలిచి ఈరోజు ఏంచేస్తున్నారు అయ్యా! అంటే.. కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు.. ఈ రోజు గుంతకల్లు నుండి గుత్తికి రావాలి అంటే 80 రూపాయిలు. ఎంత పెరిగింది అయ్యా! అంటే 27 రూపాయలు. 2019లో వారు పాదయాత్ర చేసినారు. ఇపుడు ప్రజలు చేస్తారు. మీరు ఇలా పెంచుకుంటూ పోతే, పేద మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడుతారు. మీరు పేద, మద్య తరగతి కుటుంబాల రక్తాన్ని పిండుతున్నారు. మీరు వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని లేకపోతే ప్రజల తరపున జనసేనపార్టీ రానున్న రోజుల్లో భారీ ఎత్తున ప్రజాఉద్యమం చేస్తుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు జనసేన పార్టీ వీరమహిళ విజయ, అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటి సభ్యులు సొహైల్, క్రిష్ణ, శేఖర్, గుంతకల్లు మండల అధ్యక్షులు పురుషోత్తం, గుంతకల్లు నాయకులు శేఖర్, విరేష్, విజయ్, మారుతి, మహేష్, జీలాన్, రవి, సర్దార్, ఫిరోజ్, పాండు, ధాద్దు, శివ, వంశీ, రాజు కుమార్, గణేష్, హేమంత్, అరవింద్, లడ్డు, రాకేష్, శశాంక్, విజయ్, మణి, రాము, రాజు, శంకరయ్య, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way